కొద్ది రోజల క్రిందట పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేపింది. దాదాపు నెలపైగా పరిశోధకలు ఈ వింత వ్యాధి ప్రబలడానికి గల కారణాలను కనుగొనడానికి కేంద్రం, రాష్ట్రం.. ఇలా అన్ని సంస్థలు పరిశోధనలు జరిపాల్సి వచ్చింది. చివరికి స్థానికులు తినే కూరగాయల్లో ఆర్గానో క్లోరైడ్లు అధికంగా ఉండడమే వింత వ్యాధికి కారణమని కమిటీ తేల్చి చెప్పింది. తిరిగి అలాంటి సమస్యే పునావృతమవుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి.
తూర్పు గోదావరి జిట్టా వూళ్ల గ్రామంలో ఏలూరు తరహాలో వింత వ్యాధి ప్రబలుతుంది. వూళ్ల గ్రామంలో పలువురు అస్వస్థతకు గురవుతున్నారు. రెండు రోజుల్లో 30 మంది ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం 21మంది డిశ్చార్జి అయినట్లుగా తెలుస్తుంది. మిగిలిన వారికి చికిత్స కొనసాగిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఒకచోట సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్న దశలోనే మరోచోట ఇలాంటి వ్యాధి లక్షణాలు కన్పించడం అధికారుల్లో, ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఆసుపత్రిలో చేరిన వారి రక్త నమూనాలు నిశితంగా పరిశీలించిన మీదటే.. ఒక నిర్థారణకు రాగలమని అధికారులు తెల్పుతున్నారు. అక్కడి పరిస్థితులను చూసిన స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల సంఖ్య పెరగకుముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Must Read ;- రీ ఎంట్రీ : ఏలూరులో మరల వింత వ్యాధి కలకలం