దేశవ్యాప్తంగా రైతుల ఆందోళలనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీ రాజధాని కేంద్రంగా రైతు చట్టాలపై ఆందోళనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ రైతులు నినదిస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే.. ప్రతి పాలకుడు తమని మోసం చేస్తున్నారంటూ పసుపు రైతులు రోడ్డెక్కారు. ఇలా దేశ వ్యాప్తంగా ఎక్కడా రైతు ఘోష వినిపిస్తుంది. ప్రపంచానికే అన్నదాత అయిన రైతు ‘మాకు న్యాయం చేయండంటూ నినదిస్తున్నారు’. కానీ పాలకుల కరడు గట్టిన హృదయాలు మాత్రం లేశమైనా స్పందించడం లేదు. కృష్ణా జిల్లా, చందర్లపాడులో మరో రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధ తాళలేక..
చందర్లపాడుకు చెందిన రైతు కట్టా లక్ష్మీ నారాయణ అనే రైతు తాను పండించిన పొలంలోనే ప్రెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ 28 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. అకాల వర్షాలు, సరైన సమయంలో వర్షాలు లేకపోవడం, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత.. ఇలా పలురకాల కారణాల వల్ల పంట సరిగా చేతికి రాలేదు. పంట వేయడానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలనుకుంటూ ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అంతేకాదు.. కౌలు తీసుకున్న పొలాలకు డబ్బు ఎలా చెల్లించాలో అర్థం కాక చివరకు తాను పండించిన పొలంలో పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ మరణంలో చందర్లపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Must Read ;- ఇందూరు పసుపు రైతుల నిరసన.. ఢిల్లీ రైతు ఉద్యమం గా మారబోతోందా?
సిఎంకు లేఖ..
రైతు ఆత్మహత్య చేసుకుంటూ సిఎంకు ఒక లేఖ రాశాడు. ‘నేను పత్తి యార్డులో ఆత్మహత్య చేసుకోవడానికి 25 మాత్రలు మింగాను. కానీ చావలేదు. ఆ సమయంలోనే పూర్తి పరిస్థితిని వివరిస్తూ మీకు లెటర్ రాశాను. కానీ అది మీకు చేరలేదు. నేను మొండివాడిని.. ఇప్పుడు ఇక్కడ నా ఆత్మహత్యను ఎవరు, ఎలా ఆపుతారో చూస్తాను. నేను వైయస్సార్ అభిమానిని. కౌలు రైతుల బాధలు నాకు బాగా తెలుసు’ అంటూ లేఖలో తాను పడ్డ బాధలతో పాటు.. కౌలు రైతుల బాధలను కూడా ప్రస్తావించాడు.
వైకాపా మొద్దునిద్రవీడడం లేదు..
కట్టా లక్ష్మీ నారాయణ ఆత్మహత్యపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు తాళలేక 753 మంది రైతులు మరణించారని ఆరోపించారు.
జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఇన్స్యూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని @ysjagan ఘోరంగా మోసం చేసారు.(1/3) pic.twitter.com/yoKsNKaEnO
— Lokesh Nara (@naralokesh) January 20, 2021
Also Read ;- లోకేష్ మెరుపు నిర్ణయం : వారిపై కేసు పెడితేనే అంత్యక్రియలు నిర్వహిస్తాం
‘జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వైకాపా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. ఇన్స్యూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని జగన్ మోహన్ రెడ్డి ఘోరంగా మోసం చేసారు. కృష్ణా జిల్లా,చందర్లపాడులో అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు కట్టా లక్ష్మినారాయణ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం.దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆత్మహత్యలు చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదు. వైకాపా అభిమాని అయిన కౌలు రైతు లక్ష్మీనారాయణ జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలి.’
Also Read ;- రైతుల ఆందోళనకు మద్దతుగా తుపాకీతో కాల్చుకున్న మతప్రబోధకుడు











