టీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్యాడ్ టైం ప్రారంభం అయినట్టుంది. ఏది పట్టుకున్నా రివర్స్ కొడుతోంది. మంత్రుల వివాదాలు రోజురోజుకు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే మంత్రుల వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఇప్పటికే దుమారాన్ని రేపగా , మంత్రి మల్లారెడ్డి ఆయన తనయుడిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు కావడం.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సైతం తమ మాటలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. తన వ్యాఖ్యలపై తామే సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి తలెత్తుతోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏ వివాదం బయట పడుతుంది.. ఏ మంత్రి , ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తాయో తెలియక నేతలు దినదిన గండంగా గడుపుతున్నారు.
ల్యాంగ్ కబ్జాచేస్తున్నారన్న కేసు విషయం మరవక ముందే మరో వివాదం..
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్న మల్లా రెడ్డిపై వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆయన ఏది చేసినా వివాదమే అన్నట్టుగా తయారైంది. మల్లారెడ్డిపై కొన్ని రోజుల క్రింతమే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లారెడ్డి కళాశాలకు ఆనుకుని వున్న తన భూమిని కాలేజీ యాజమాన్యం తన కళాశాలలో కలుపుకుందని.. తన భూమి వివరాలు అడగడానికి వెళ్తే రెస్పాన్స్ లేదని..తన భూమిని కబ్జా పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనిపై కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ కేసులో విచారణ సాగుతోంది. అయితే తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని.. కావాలనే తమపై బుదరజల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన తనయుడు చెప్పకొచ్చారు. ఈ వివాదం సద్దుమణగక ముందే మల్లారెడ్డి కళాశాల పై మరోవివాదం ముసురుకుంది. తన ఇంజనీరింగ్ కళాశాలకు న్యాక్ గ్రేడ్ కోసం అనుమతి కోరుతూ పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించింది ఎన్ఏసీ.
సర్టిఫికేట్లు జెన్యూన్ కావు..
న్యాక్ గ్రేడ్ కోసం సమర్పించిన సర్టిఫికేట్లు సరైనవి కావంటూ తిరస్కరించడమే కాకుండా ఐదేళ్ళపాటు న్యాక్ గ్రేడ్ కు అనర్హులంటూ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది న్యాక్. ఇప్పటికే రెండు సార్లు ఇదే అంశంపై మల్లారెడ్డి కళాశాలకు నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో బ్లాక్ లిస్ట్ లో పెడుతూ మల్లారెడ్డి కాలేజీ ప్రిన్స్ పల్ కు లేఖ రాసింది న్యాక్. న్యాక్ గ్రేడ్ కు అప్లై చేసుకున్న సమయంలో బీహెచ్ఈఎల్, యాష్ టెక్నాలజీ, ఏయిర్ టెల్ కు సంబందించిన నకిలీ డాక్యుమెంట్లను పొందుపర్చారని ఆరోపిస్తూ న్యాక్ గ్రేడ్ తిరస్కరించింది. లెటర్ హెడ్ , సిగ్నేచర్ ఫోర్జరీ చేసారంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది న్యాక్ సంస్థ.
Must Read ;- టీఆర్ఎస్ కథ తేల్చేందుకు ‘త్రీ పాయింట్ ఫైట్’