తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన డాక్టర్ రోజి కొవిడ్ కారణంగా మృతి చెందటం పట్ల ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ రోజి మృతి తీవ్రంగా కలచివేసిందన్నారు. ‘‘కోవిడ్ బాధితులకు వైద్యసేవలందిస్తూ వైరస్ బారినపడి కన్నుమూయడంతో కన్నవాళ్లకు తీరని విషాదం మిగిలింది. బంగారు భవిష్యత్తు వున్న రోజి అకాల మరణం పట్ల నా సంతాపం తెలియజేస్తున్నాను. ఎంతో మందికి ప్రాణభిక్ష పెడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Must Read ;- ఎందరికో విముక్తి కల్పించి తాను బలై.. యువ వైద్యురాలి విషాదాంతం
కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్ డాక్టర్ రోజి మృతి తీవ్రంగా కలచివేసింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి చెందిన రోజి నీట్ రాసి మంచి ర్యాంకుతో ఏలూరు ఆశ్రం వైద్యకళాశాలలో సీటు సంపాదించి విజయవంతంగా MBBS పూర్తి చేసి అక్కడే హౌస్ సర్జన్ గా చేరడం ఎంతో గర్వకారణం.(1/2) pic.twitter.com/VP3DsCNE6W
— Lokesh Nara (@naralokesh) June 2, 2021