పెళ్లిళ్లకు కరోనా వల్ల గట్టి దెబ్బే తగిలింది. సామాన్యులే కాదు, సెలబ్రిటీల వివాహా వేడుకలను సైతం తల్లకిందులు చేసిందీ కరోనా. కొందరు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటే, మరికొందరు కేవలం కుటుంబసభ్యుల మధ్య నిరాడంబరంగా చేసుకుని ముగించారు. కొందరు అంతటితో ఆగకుండా కరోనాను సైతం లెక్కచేయకుండా తమ జీవిత భాగస్వామితో ఏడుఅడుగులు వేసిన సంఘలనలు కూడా లేకపోలేదు. ఇప్పుడు అలాంటి సంఘలనే ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పెళ్లి కూతురు కరోనా బారిన పడినా కూడా వాళ్ల పెళ్లి ఆగలేదు. అనుకున్న ముహుర్తానికే వాళ్లు దంపతులుగా మారారు. మరి వారి వింత పెళ్లి గురించి వివారాలు తెలుసుకుందామా…
పెళ్లి కూతురికి కరోనా
రాజస్థాన్ లోని షాబాద్ కి చెందిన యువతికి నవంబర్ 30న వివాహా ముహుర్తాన్ని నిర్ణయించారు. పెళ్లి పనులు జోరుగా జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురు మేనమామ, మేనత్తలకు కరోనా సోకిందని తేలింది. వెంటనే పెళ్లి కూతురు కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలను నిర్వహించారు. ఈ పరిక్షల్లో సరిగ్గా పెళ్లి జరగాల్సిన రోజున పెళ్లి కూతురు కరోనా బారిన పడినట్లుగా రిపోర్టులో తేలింది. కరోనా బంధువులకో లేక కుటుంబ సభ్యలకో అయితే పెళ్లి జరిపించవచ్చు. కానీ, ఏకంగా పెళ్లి కూతురుకే కరోనా సోకితే ఏం చేయగలం అని అందరూ నిరాశ చెందారు. ఏం చేయాలో తోచక ఇరు కుటుంబాల సభ్యలు తలలు పట్టుకున్నారు. చివరికి ఎలాగైనా పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.
కొవిడ్ సెంటర్ లో పెళ్లి వేడుక
కొవిడ్ సోకిందని తేలడంతో కెల్వారా లోని కొవిడ్ సెంటర్లో అందరినీ చేర్పించడం జరిగింది. అక్కడే పెళ్లి కూతురిని కూడా చికిత్స నిమిత్తం తరలించాలి. అనుకున్న ముహుర్తానికే పెళ్లి జరగాలని నిర్ణయించిన పెద్దలు కొవిడ్ సెంటర్ వారితో మాట్లాడి ప్రత్యేక అనుమతి కోరి వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి హాజరైన ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు, పూజారి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో సహా పీపీఈ కిట్లతో సిద్ధమయ్యారు. పెళ్లికి గుర్తుగా చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి పూజారి సూచనల మేరకు వివాహా తంతు ముగించారు. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్ లో వైరల్గా మారింది. నెటిజన్లు కూడా పెద్దల సమయస్పూర్తికి, జాగ్రత్తలకి ప్రశంసిస్తున్నారు. పెళ్లి కూతురు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
సరికొత్త పద్ధతులు
కరోనా దెబ్బకి పరిస్థితి ఇలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కొత్త దశాబ్దాన్ని ఎంతో ఆనందంగా కొత్త జీవితాలను ఆరంభించాలనుకున్న కొత్త జంటలకు కరోనా షాకిచ్చింది. డెస్టినేషన్ వెడ్డింగ్లతో అదరగొట్టాలనుకున్న సెలబ్రిటీలు కూడా కరోనా పోతుందని ఎదురుచూసి ఆఖరికి ఉన్న ఊరు దాటకుండా, కరోనా నిబంధనల దెబ్బకి కనీసం బంధువులని కూడా పిలవలేక చాలా సింపుల్ కానియ్యాల్సివచ్చింది. ఇక సామాన్యలు కూడా కరోనా సోకినా సరే పెళ్లిళ్లను వాయిదా వేయకుండా ప్రత్యామ్నాలు పాటించి మరీ కొత్త జీవితాన్ని సరికొత్త పద్ధతిలో ఆరంభిస్తున్నారు. ఒకప్పుడు కరోనా అనగానే భయపడిపోయిన జనం, నేడు కరోనాని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసుకున్నట్లున్నారు.
Must Read ;- జీవనశైలి, రోగ నిరోధక శక్తి.. కరోనాకు ఆ నాలుగు పల్లెలు దూరం