రుయా ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ప్రభుత్వం ప్రకటించినట్టు రుయాలో చనిపోయింది 11 మంది కాదని, 30 మంది అంటూ మాజీ ఎంపీ చింతా మోహన్ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. రుయాలో ఆక్సిజన్ అందక 30 మంది కరోనా రోగులు చనిపోయినట్టు చింతా మోహన్ ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల సంఘం వెంటనే స్పందించింది.దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది.
ఎన్ హెచ్ ఆర్సీ సీరియస్
మానవ తప్పిదం వల్లే రుయాలో 30 మంది చనిపోయారని మాజీ ఎంపీ చింత మోహన్ ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్గా తీసుకుంది. ఇదే నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రభత్వం కేవలం 11 మంది ఆక్సిజన్ అందక చనిపోయారని ప్రకటించడం,ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారనే ఆరోపణలు వస్తున్న తరుణంలో జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక కోరడం ఆసక్తికరంగా మారింది.
Must Read ;- రుయా నిజాలేంటి..? అసలు ఏం జరుగుతోంది?