దేశంలో కరోనాతో ప్రతి రోజూ వేలాది మంది చనిపోతున్నారు.ప్రభుత్వ గణాంకాలు మాత్రం రోజుకు 4 వేలు దాటడం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో కరోనాతో చనిపోయిన వారిని తీసుకువెళ్లేందుకు కుటుంబీకులు ముందుకు రావడం లేదు. దీంతో యూపీలో 70 శవాలు గంగానదిలో పడేశారు.అవి నదిలో కొట్టుకుంటూ బీహార్కు చేరాయి.ఆ శవాల ఫోటోలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.జాతీయ మానవ హక్కుల సంఘం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా పూర్తి చేయాలని ఆదేశించింది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు అవసరమైన చట్టాలను చేయాలని పలు కీలక సూచనలు చేసింది.కరోనాతో మరణించిన వారి గౌరవ ప్రతిష్ఠలు కాపాడేలా కొత్త చట్టం ఉండాలని ఆదేశించింది.
సామూహికంగా వద్దు
కరోనాతో మరణించిన వారి శవాలను కుటుంబీకులు తీసుకువెళ్లకపోవడంతో దేశంలోని పలు ఆసుపత్రుల్లో శవాలు పేరుకు పోతున్నాయి.ఒక్కోసారి సామూహికంగా కాల్చివేయడం,ఖననం చేయడం చేస్తున్నారు.ఇలా చేయవద్దని జాతీయ మానవ హక్కుల సంఘం కోరింది. సామూహిక ఖననాలు.. మరణించిన వారి గౌరవాన్ని దిగజార్చుతాయని అభిప్రాయపడింది.
సామూహిక ఖననాలు,దహనాలు మృతుల గౌరవాన్ని దెబ్బతీస్తాయని జాతీయ మానవ హక్కుల సంఘం గుర్తు చేసింది. కరోనాతో చనిపోయిన వారి గౌరవం పెరిగేలా అంత్యక్రియలు నిర్వహించేందుకు కొత్త చట్టం తీసుకురావాలంటూ కేంద్ర హూంశాఖ,ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖలు,రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఎన్హెచ్ఆర్సీ లేఖలు రాసింది.
Must Read ;-కరోనా కు జీవించే హక్కు ఉంది.. మాజీ సీఎం స్టేట్ మెంట్ : ట్రోల్ చేస్తున్న నెటిజన్లు











