విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లైగర్. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా ముంబాయిలో షూటింగ్ జరుపుకుంది. ఆమధ్య లైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆతర్వాత లైగర్ ఏమైంది..? ఎప్పుడు వస్తుందో..? క్లారిటీ లేదు. సెప్టెంబర్ లో లైగర్ రిలీజ్ అని గతంలో ప్రకటించారు. సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో లైగర్ పరిస్థితి ఏంటి..? ఎప్పుడు వస్తుంది.? అనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల పూరి, ఛార్మి విచారణ నిమిత్తం ఈడీ ముందు హాజరు కావడంతో లైగర్ గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇప్పటి వరకు దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన షూటింగ్ లో ఎక్కువ భాగం వందలాది మంది జూనీయర్ ఆర్టిస్టులతో చిత్రీకరించాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఆ సీన్స్ చిత్రీకరించడం కరోనా వలన రిస్క్ కాబట్టి ఇన్నాళ్లు ఆగారట. ఇక వెయిట్ చేయకుండా షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా షెడ్యూల్ ను వచ్చే వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. గోవాలో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారని తెలిసింది. విజయ్ దేవరకొండ కొంత మంది పైటర్స్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ బాక్సింగ్ యాక్షన్ డ్రామాను ఈ నెలలోనే రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో అనుకున్న విధంగా సెప్టెంబర్ లో రిలీజ్ కావడం లేదు. షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత లైగర్ రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారని సమాచారం.
Must Read ;- పూరి, ఛార్మిల ఈ డ్రగ్స్ కనెక్ట్స్ ఏమిటి?