ఐదు రాష్ట్రాల ఎన్నికలతో తేలనున్న జాతీయ పార్టీల భవితవ్యం..!
ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి 10 నుంచి మార్చి 10 వరకు జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నాయి! ఈ ఎన్నికలే ఆ పార్టీలకు రానున్న 2024 లో జరిగే లోక్ సభ సాధారణ ఎన్నికలకు నెట్ ప్రాక్టీస్ లాంటిది! దేశ వ్యాప్తంగా ప్రజల నాడిని అంచన వేయడానికి ఉపయోగపడుతాయని పార్టీలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 403, ఉత్తరాఖండ్ లో 70, పంజాబ్ 117, గోవాలో 40, మణిపూర్ లో 60 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలనూ బీజేపీ నేతృత్వంలో నడిచే ప్రభుత్వాలున్నాయి. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలను మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నాయి రాజకీయాలు! ఈ ఎన్నికలను బేస్ చేసుకునే.. పార్టీల బలాబలాలు తేలనున్నాయి. 2023 చివరిలో జగన్ రెడ్డి తెలంగాణ మాదిరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నట్లు అందుతున్న సంకేతాలు. అలానే కేసీఆర్ కూడా ఈ ఏడాది చివరిలోనైనా, లేకుండా 2023 జనవరిలో నైనా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని అందుతున్న సమాచారం!
షెడ్యూల్ ఇలా..
ఐదు రాష్ట్రాల్లో నెలరోజు పాటు 7 విడుతల ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఫ్రిబవరి 10న ఉత్తరప్రదేశ్ లో తొలివిడత, 14న ఉత్తరప్రదేశ్ రెండో విడత, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల ఎన్నికలు, 20, 23 న ఉత్తర ప్రదేశ్ మూడు, నాలుగు విడతల ఎన్నికలు, 27న ఉత్తరప్రదేశ్ ఐదోవ విడత, మణిపూర్ ఎన్నికలు, మార్చి 3న ఉత్తరప్రదేశ్ ఆరోవ విడత, 7వ తేదీన ఏడోవ విడత ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్నామని శుక్రవారం ఢిల్లీ విజ్ఞాన భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర షెడ్యూల్ ను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు. ఐదు రాష్ట్రాల సంబంధించి నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఐదు రాష్ట్రాలలో మొత్తం 690 నియోజకవర్గాల్లో 18.34 కోట్ల మంది ఓటరులు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు సుశీల్ చంద్ర వివరించారు.










