చిత్రపరిశ్రమలో ఇప్పుడు అందరి టార్గెట్ ‘మహాశివరాత్రి’ అయిపోయింది. ‘మహాశివత్రి’ సందర్భంగా మార్చి 11వ తేదీన బరిలోకి దిగిపోవడానికి ఇప్పటికే కొన్ని సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఇక సెట్స్ పై ఉన్న సినిమాలు .. తమ వైపు నుంచి టీజర్లు .. ట్రైలర్లు వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా షూటింగు మొదలుపెట్టినవాళ్లు, ఫస్టులుక్ వదలాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలా తమ సినిమా ఏ దశలో ఉందో దానిని బట్టి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి సంసిద్ధమవుతున్నారు.
ఇక ఇన్నేసి సినిమాలు ఇలా ఏదో ఒక రూపంలో అభిమానులను పలకరించడానికి ప్రయత్నాలు చేస్తుంటే, ‘ఖిలాడి‘ మాత్రం ఊరుకుంటాడా? నేను సైతం అంటూ టీజర్ తో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ ‘ఖిలాడి’ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ‘మహాశివరాత్రి’ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి టీజర్ ను వదలాలని ఈ సినిమా టీమ్ ఫిక్స్ అయిందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.
రవితేజ సరసన నాయికలుగా డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి అలరించనున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగులో అనసూయ మెరవనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజతో తలపడే విలన్ పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు. ఆయన పాత్రను చాలా విభిన్నంగా డిజైన్ చేయడం జరిగిందనీ, ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మే 28వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇటీవల రవితేజ నుంచి వచ్చిన ‘క్రాక్’ భారీ హిట్ కొట్టడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. మరి ఈ ‘ఖిలాడి’ హిట్టు నుంచి తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత రమేశ్ వర్మదే.
Must Read ;- పేలనున్న అనసూయ ఐటమ్ బాంబ్











