అరెస్ట్ చేసేందుకు యత్నాలా?
ఏపీలో జగన్ రెడ్డి పాలనలో అధికారపార్టీ నేతలు వాడుతున్న రాజకీయాలు విమర్శలు వినేందుకు అనార్హం అని ప్రజలకు ఎప్పుడో ఒక క్లారిటీ వచ్చింది. మంత్రులు కొడాలి, అనిల్, ఎమ్మెల్యేలు ద్వారంపూడి, అంబటి, వంశీ వాడే అసభ్యకర పదజాలాన్ని వినివిని, వారిని ప్రజలు ఎప్పుడు సమాజం నుంచి బహిష్కరించారు. వారిని మంత్రులు, ప్రజా ప్రతినిధులని గుర్తుపెట్టుకోవడం మాని, బూతుల మంత్రులు, బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అని ఒక ముద్రవేసి, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వంటివి ప్రజలు ఎప్పుడో ప్రారంభించారు. ఈ విషయాలన్ని గూగుల్ కూడా గుర్తు పెట్టుకుంది. ఎందుకంటే ఏపీలో బూతుల ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఎవరయ్యా .. అని గూగుల్లో టైప్ చేస్తే చాలు ఆ బూతు మంత్రులు వీరే అని కొడాలి నాని, అనిల్ యాదవ్ లతోపాటు ద్వారంపూడి, అంబటి రాంబాబు లు దర్శనమిస్తుంటారు.
రాజకీయ విమర్శలకే హార్ట్ అయితే ఎలా??
మీరు తిడితే మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు.. విపక్షాలు విమర్శిస్తే బూతులా? అని తెలుగు దేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి అయ్యన్న ఇంటిని బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు భారీ మోహరించారు. ఆయన ఇంట్లో లేరు అని చెప్పిన వినకుండా పోలీసులు హడవుడి చేశారు. ఆయన ఇంట్లో లేరు అని కార్యకర్తలు చెప్పినా వినకుండా ఆయను బయటకు రావాలని, బయటికొస్తే నోటీసులిచ్చి వెళ్లిపోతామని పశ్చిమ గోదావరి జిల్లా నల్లజెర్ల సీఐ రఘు చెప్పారు. సీఐ రఘు, ఎస్ఐ శ్రీహరిరావు, అవినాష్ తోపాటు పోలీసులు సిబ్బంది భారీ సంఖ్యలో తరలివచ్చి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏమోచ్చిందని, అయ్యన్న ఏం నేరం చేశారో చెప్పాలని టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. ఇంట్లో లేరని చెప్పిన, పోలీసులు ఇంట్లోనే ఉన్నారని వాదించడంపై మండిపడ్డారు. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు.. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా నాయకుడు రామకృష్ణ ఫిర్యాదుతో పోలీసులు 153ఎ, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.