సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘తాండవ్’ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ చేసిన రాజకీయ డ్రామా కారణంగా మతం రంగు పులుముకుంది. ఒక వర్గం వారు ఈ సిరీస్ పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ మనోభావాలను కించపరిచారని ఆరోపించడంతో ఇందులో నటించిన అందరిపైనా కేసులు నమోదు చేశారు. ముంబైలోని ఘాట్కోపర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ సెక్షన్ 153 (ఎ), 295 (ఎ), 505 (2) కింద ఈ కేసులు నమోదయ్యాయి.
విషయం ఏమిటంటే ఈ చిత్ర యూనిట్ పై ఇది మొదటి కేసు కాదు. ఇంతకుముందు లక్నోలో జరిగిన సిరీస్పై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఇది అమెజాన్ ప్రైమ్ ఇండియాకి చెందిన కంటెంట్. దీని హెడ్ అపర్ణ పురోహిత్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాత హిమాన్షు కృష్ణ మెహ్రా , రచయిత గౌరవ్ సోలంకి తదితరులు ఈ విషయంపై మాట్లాడుతూ ప్రజల మనోభావాలను తాము గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. తమ వైపు నుంచి ఇలాంటి తప్పు జరిగినందుకు క్షమాపణలు చెప్పారు.
దీనికి అవసరమైన మార్పులు చేయనున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. “మన దేశ ప్రజల మనోభావాలపై మాకు చాలా గౌరవం ఉంది. మేము ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ సిరీస్ తీయలేదని వివరించారు. ఇందులోని అభ్యంతరాలపై ఒకసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని, అవసరమైన మార్పులు చేసి రీషూట్ చేస్తామని వారు వివరించారు. ఈ విషయంలో తమకు మార్గ నిర్దేశం చేసిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ధన్యావాదాలు తెలిపారు. తమ వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ చెబుతున్నామన్నారు.
Must Read ;- విక్రమ్ భట్ ‘అనామిక’ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్