Prakash Raj And Team Submitted Nominations For Maa Elections :
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్ననటుడు ప్రకాష్ రాజ్ తన నామినేషన్ దాఖలు చేశారు. అక్టోబరు 10న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈ పోటీ ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానల్ మధ్య జరగబోతోంది. ఈరోజు ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీవీఎల్ నరసింహారావు కూడా ఈరోజే నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలింఛాంబర్ లో ఈ నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలూ తమ ఎన్నికల అంజెండాను ప్రకటించాయి. రెండు ప్యానల్స్ తరఫున ఎవరెవరు పోటీ చేయబోతున్నారో ప్రకటించారు. ఇక మంచు విష్ణు ప్యానల్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. రెండు ప్యానల్స్ ప్రచారం కూడా ముమ్మరం చేశారు. సభ్యులందరికీ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.
Must Read ;- పోటాపోటీగా ‘మా’ విందు పార్టీలు











