ఎంపీ రఘురామరాజు ఓ వైపు తన అరెస్టు వ్యవహారంపై అందరికి ఫిర్యాదు చేస్తుండటంతో పాటు తనపై జరిగిన దాడి గురించి ఎంపీలకు లేఖలు రాశారు.ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి ప్రభుత్వం నుంచి జీతాలు,భత్యాలు తీసుకుంటూ సాక్షి,టీవీ9 ఛానళ్లలో తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని వైసీపీ ఎంపీ రఘురామరాజు ఏపీ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు.ఇప్పటికే సుధాకర్రెడ్డి తీరును తప్పుపట్టిన హైకోర్టు క్షమించి వదిలేసిందన్నారు.ప్రభుత్వ ఏఏజీగా పనిచేస్తూ జీతాలు తీసుకుంటూ తనపై అసభ్య పదజాలంతో సాక్షి,టీవీ9లో తనను తిట్టిపోసిన పొన్నవోలు సుధాకర్రెడ్డి న్యాయవాద వృత్తికి అనర్హుడని ఎంపీ రఘురామరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి
ఏఏజీ సుధాకర్రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని,న్యాయవాద వృత్తికి అనర్హుడిగా ప్రకటించాలని ఎంపీ రఘురామరాజు బార్ కౌన్సిల్కు రాసిన లేఖలో అభ్యర్థించారు.ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ తనపై ఇష్టం వచ్చినట్టు రెండు ఛానళ్లలో మాట్లాడారని ఈ వీడియోలను కూడా బార్ కౌన్సిల్కు పంపారు.పొన్నవోలు సుధాకర్రెడ్డి న్యాయవాదిగా అనర్హుడిగా ప్రకటించాలని రఘురామరాజు ఆ లేఖలో కోరారు.
ఎంపీలకు లేఖలు..
మరో వైపు ఎంపీ రఘురామరాజు తన అరెస్టు,తదనంతర పరిణామాలను వివరిస్తూ ఎంపీలకు లేఖ రాశారు.రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు.దేశంలో తొలిసారి ఓ ఎంపీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు.ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది.రఘురామ లేఖను ట్విటర్లో మాణికం ఠాగూర్ పోస్ట్ చేశారు.రఘురామపై పోలీసుల దాడిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
Must Read ;- ఆ ముగ్గురూ కుట్ర చేశారు : రఘురామరాజు సంచలన ఆరోపణలు!











