తాను అధికార పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించలేదని, వేరే ఏ పార్టీతోనూ జతకట్టలేదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్షంరాజు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో లోపాలను మాత్రమే ప్రస్తావించానని, తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని అన్నారు. నాపై ఈ నెల 10న ఫిర్యాదు చేసి 11న చేసినట్లు చెబుతున్నారని అన్నారు. అనర్హత వేటుపై ఇప్పటికే నాలుగైదుసార్లు ఫిర్యాదు చేశారని రఘురామరాజు పేర్కొన్నారు. వైసీపీ గుర్తుపై గెలిచిన రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్పడుతున్నారని,పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్సభలో వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంపై రఘురామరాజు స్పందించి ఈ విధంగా పేర్కొన్నారు.
Must Read ;- పింఛన్ల హామీ నెరవేర్చండి.. సీఎం జగన్మోహన్రెడ్డికి ఎంపీ రఘురామరాజు లేఖ