అన్ని రాష్ట్రాల సీఎంలు,గవర్నర్లు,ఎంపీలకు లేఖలు రాసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వృద్దాప్య,వికలాంగులు,వితంతువుల పింఛన్లను రూ.2750కు పెంచాలని ఎంపీ రఘురామరాజు సీఎంకు రాసిన లేఖలో కోరారు.ఏటా రూ.250 పెంచుకుంటూ పోతామని ఎన్నికల్లో హమీ ఇచ్చారని,ఇప్పటికే ఏడాది పాటు ఆలస్యం అయినందుకు ఆ మొత్తం కూడా కలిపి ఈ నెల నుంచి పింఛను రూ.3000 పంపిణీ చేయాలని ఎంపీ రఘురామరాజు విజ్ఙప్తి చేశారు.
వచ్చే నెలలో రూ.250 పెంచే అవకాశం
వచ్చే నెల నుంచి ఏపీలో సామాజిక పింఛన్లను రూ.250 పెంచే అవకాశం ఉంది. దీనిపై ఆరు నెలల కిందటే సీఎం హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.2250ను వచ్చే నెల నుంచి రూ.2500 చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఏటా రూ.250 పెంచాల్సి ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకు ఆ మేరకు పింఛన్లు పెంచలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వచ్చే నెల నుంచి రూ.250 పెంచుతామని సీఎం గతంలోనే ప్రకటించారు.
Must Read ;- రాష్ట్రాల గవర్నర్లు,లెప్ట్నెంట్ గవర్నర్లకు రఘురామరాజు లేఖలు