వందల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన నౌకలో లక్ష కోట్ల సంపద బయటపడింది. ఈ ఘటన కొలంబియా పరిధిలోని కరేబియన్ సముద్రంలో ఆవిష్కృతమైంది. సుమారు మూడు వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు సముద్రంలో ఓ నౌకను ముంచేశారు.2015లో దాని ఆనవాలను అక్కడి ప్రభుత్వ పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. కాగా తాజాగా ఆ నౌక వద్ద మరో రెండు నౌకలు మునిగిపోయిన సత్తిలిలో ఉండడాన్ని అధికారులు గుర్తించారు. కాగా, ఆ రెండు నౌకల్లో కళ్లు చెదిరే రీతిలో అత్యంత విలైవన సంపద ఉన్నట్టు తెలుస్తోంది.
వాస్తవానికి 1708లో బ్రిటన్ సైన్యం స్పెయిన్ నేవీకి చెందిన శాన్ జోస్ అనే యుద్ధ నౌకను ముంచేసింది. 62 ఫిరంగులతో ఆ రోజుల్లో శాన్ జోస్ గొప్ప యుద్ధ నౌకగా పేరుగాంచింది. మునిగిపోయిన ఈ నౌకను 2015లో కొలంబియా వద్ద కారీబియన్ సముద్ర జలాల్లో గుర్తించారు. అయితే, తాజాగా ఈ నౌక మునిగిపోయిన ప్రాంతం వద్ద మరో రెండు నౌకలు కూడా మునిగిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నౌకల నిండా ఉన్న బంగారం విలువ అంతాఇంతా కాదు… ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం లక్షా 27 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ రెండు నౌకలకు చెందిన ఫుటేజిని స్పెయిన్ ప్రభుత్వం విడుదల చేసింది. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతున ఉన్న ఆ శిథిల నౌకల వద్దకు రిమోట్ కంట్రోల్ తో నడిచే ఓ వాహనాన్ని పంపి పరిశీలించారు.కాగా, పరిశీలన అనంతరం ఈ నౌకలు 200 ఏళ్ల నాటివి అయ్యుంటాయని భావిస్తున్నారు.ఈ నౌకల్లో గుట్టలు గుట్టలుగా ఉన్న బంగారు నాణేలు, ఇతర ఉపకరణాలు, పోర్సలిన్ కప్పులు దర్శనమిచ్చాయి. ఆ నౌకల్లో లభ్యమైన ఫలకాలపై ఉన్న లిపి ఆధారంగా ఆ నౌకల వివరాలు తెలుసుకునేందుకు నేవీ, ప్రభుత్వ పురావస్తు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.