అసలు ఏపీలో కాంగ్రెస్ అనే పార్టీ ఉందని ప్రజలు మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. అందుకేనేమో అప్పుడప్పుడూ మేమున్నాం గుర్తించండి అంటుంటారు కాంగ్రెస్ నాయకులు. 350 రోజులకు పైగా అమరావతి రైతుల పోరాడం చేస్తుంటే, ఇప్పుడు మేమున్నాం మీకు మద్దతివ్వడానికి అంటూ వారికి సంఘీబావం తెలపడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడారు. ఏపీ సిఎం ప్రవర్తనను తప్పుబట్టారు.
నో అపాయింట్మెంట్
ఏపీలో అసలు సిఎం ఉన్నారా లేదా అర్థం కావడం లేదని శైలజానాథ్ చెప్పారు. సిఎంకు కాంగ్రెస్ తరపున లేఖ పంపామని, రాజధాని విషయంగా చర్చించాలని, రైతుల త్యాగం గుర్తించాలని లేఖలో పేర్కోనట్టు తెలియజేశారు. అమరావతి విషయం మాట్లాడడానికి సమయమివ్వాల్సిందిగా కోరామని కూడా తెల్పారు. కానీ, సిఎం అసలు పట్టించుకోలేదని, అసలు రాష్ట్ర ప్రజలను పట్టించుకునే ఉద్దేశాలు ఉన్నట్లు లేవని చెప్పుకొచ్చారు. అన్నీ ప్రయత్నాలు చేసిన మీదటే రైతులకు మద్దతు ప్రకటించాలని వచ్చామని, కానీ అధికార పార్టీ అన్యాయంగా అందరినీ అరెస్టులు చేసి నిర్భందించిందని చెప్పారు.
అసెంబ్లీ జరిగిన తీరును చూసి ప్రజలు ఛీదరించుకుంటున్నారని, అధికార పార్టీ నాయకులకు అరవడం తప్ప సమాధానాలు చెప్పడం రాదని దుయ్యబట్టారు. ఇంతటితో తమ ప్రయత్నం ఆగదని, సిఎంకు మళ్లీ లేఖ రాస్తామని, ఒకవేళ స్పందించకపోతే కార్యాచరణ సిద్ధం చేసి ప్రభుత్వ అరాచక, నిర్లక్ష్య విధానాలు ప్రజలకు తెలిసేలా చేస్తామని చెప్పారు.
మంత్రులకే దిక్కులేదు.. ఇక వీళ్లేంత…
జగన్ తాను కలవాలనుకుంటే తప్ప, ఎవరు సిఎం జగన్ ని కలవాలనుకున్నా కుదరదని అధికార పార్టీలోని నేతలే అంటారు. ఒక్కోసారి మంత్రలకు సైతం జగన్ దర్శనభాగ్యం దొరకడం కష్టమని చాలామందికి విధితమే. అటువంటి స్పెషల్ సిఎంని కలవాలంటే మాటలా, సొంత పార్టీవారే ఒక్కోసారి అవకాశం లేక ఎదురుచూస్తుంటారు. అటువంటిది రాష్ట్రంలో అసలు ఉనికన్నదే లేని పార్టీ అధ్యక్షుడి లేఖకు స్పందనని ఆశించడం అత్యాశే అవుతుంది. మరి తర్వాతి లేఖకైనా సిఎం స్పందిస్తారేమో చూడాలి.
Also Read: అమరావతికి ఇచ్చింది మట్టి, నీళ్లేగా.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్