చంద్రబాబు నాయుడు.. అధికార పార్టీ నాయకులపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దీనిపై ఎవరైనా ప్రతిస్పందించి.. ఆయనపై దాడి లాంటివి చేస్తే మాకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓడినప్పటి నుంచి.. చంద్రబాబు, అధికార పార్టీ నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. జుగుప్సాకరమైన భాషను వాడుతున్నారని అన్నారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందపైనా ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారని చెప్తూ.. చంద్రబాబు తీరును సజ్జల తీవ్రంగా ఆక్షేపించారు.
చెవుల్లో రక్తం వస్తుందేమో..
చంద్రబాబు భాషను ఇంతగా విమర్శిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి.. ఒక్కసారి వారి అధికార పార్టీ నాయకుల భాషను వినిపించాలి.. మొన్నటి మొన్న పెద్దిరెడ్డి ఈసీని ఉద్దేశించి ఎలా మాట్టాడాడో ఒకసారి వినిపించాలి. ఇక అందరికంటే ముఖ్యులు.. భాష వాడకంలో సిద్దహస్తులైనా కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ గార్ల భాషను కూడా వినిపించాలి. అప్పుడు సజ్జల గారి చెవుల్లో రక్తం రావడం ఖాయం. అయినా కూడా తమ పార్టీ వాళ్లు అద్భుతంగా మాట్లాడుతున్నారని కితాబిస్తారో ఏమో. చంద్రబాబు భాషను తూలనాడడం సంగతి పక్కన పెడితే.. ఏమైనా జరిగితే బాధ్యులం కాదు అనడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పాలి. ఈయన గారి స్టేట్ మెంట్లు చూస్తుంటే.. ఏదైనా చేయాలనే ప్లానా.. లేక చేయండి అని శ్రేణులకు సిగ్నల్ ఇస్తున్నారా.. చంద్రబాబు పర్యటన సాఫీగా సాగుతుండడంతో.. దానిలో ఎలాగైనా గొడవుల సృష్టించాలనే ఆలోచన దాగుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- కుప్పంలో వైసీపీ అరాచకాలు.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..