ఇందిరాపార్క్ వద్ద ఈ రోజు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షలో జగన్-షర్మిల మధ్య ఉన్న గ్యాప్ మీడియా సాక్షిగా వెల్లడయ్యింది. ఇక్కడ షర్మిల మాట్లాడుతున్న సమయంలో సాక్షి టీవీ కెమెరామెన్ కనపడ్డారు. దీంతో‘ మీరు ఇక్కడికెందుకు వచ్చారు.. ఎలాగు కవరేజ్ చేయరుగా…. వెళ్లిపోండి’ అంటూ షర్మిల సూటిగా చెప్పేశారు. ఆ మాటలతో అక్కడున్న వారంతా అవాక్కవగా పక్కనే ఉన్న విజయమ్మ షర్మిలను సముదాయించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇందిరా పార్కు వద్ద షర్మిల దీక్ష చేశారు.
తోపులాటలో స్పృహ తప్పిన షర్మిల
పోలీసులు షర్మిలను ఒకరోజు దీక్షకు మాత్రమే అనుమతించడంతో ఈ రోజు ఉదయం నుంచి ఆమె ఇందిరాపార్కు వద్ద దీక్ష కొనసాగించారు. సమయం పూర్తి కాగా దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు చెప్పినా ఆమె కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. దీంతో
ఇందిరా పార్కు నుంచి లోటస్ పాండ్కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించగా తెలుగుతల్లి ఫ్లైఓవర్పై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు, పోలీసులు మధ్య జరిగిన తోపులాటలో షర్మిల స్పృహ తప్పి పడిపోయారు. తేరుకున్నాక ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోటస్ పాండ్ వద్ద వదిలారు.
Must Read ;- షర్మిల పక్కా స్క్రిప్ట్.. అధికార టీఆర్ఎస్ను అంటేనే ఆదరిస్తారనా..!