Single Dose Of Sputnik Vaccine Is Enough :
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. వైరస్ ప్రభావం చూపుతూనే ఉంది. అయితే కరోనా సోకినవాళ్లు టీకా తీసుకోవచ్చా..? ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి? అనే విషయాలపై చాలామందికి సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మనదేశంలోకి స్పుత్నిక్ రాబోతుంది. కరోనా సోకినవాళ్లు ఈ వ్యాక్సిన్ సింగిల్ డోస్ తీసుకుంటే చాలని సైన్స్ డైరెక్ట్ జర్నల్లో సర్వే స్పష్టం చేసింది. రెండో డోసు కూడా వేసుకుంటే యాంటీబాడీలు పెరగడంతో పాటు న్యూట్రలైజింగ్ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొంది. ఒక్క డోసు వ్యాక్సిన్తోనే ఏకంగా 94శాతం ప్రభావం ఉంటోందని, పలువురిపై ప్రయోగాలు కూడా చేశామని తెలిపింది.
స్పుత్నిక్ వస్తే..
స్పుత్నిక్ అందుబాటులోకి వస్తే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగనుంది. కరోనాపై ఈ వ్యాక్సిన్ 94 శాతం ప్రభావశీలత చూపుతోందని ఇప్పటికే తేలింది. మొదట రష్యా నుంచి దిగుమతి చేసుకున్న డోసులను వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆశించిన మేరకు వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. రాబోయే వారాల్లో వాణిజ్యపరంగా స్పుత్నిక్ అందుబాటులోకి రానుంది. స్పుత్నిక్ కు మంచి రేటింగ్ ఉండటంతో చాలామంది.. ఈ టీకా కోసం ఎదురుచూస్తున్నారు.
Sputnik Vaccine
భారీగా తగ్గిన కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31,443 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో 118 రోజుల తర్వాత కేసులు భారీగా తగ్గాయి. ప్రస్తుతం కేసులు 4,31,315గా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్నా తర్వాత ఇతర వైరస్ లు దాడి చేసే అవకాశాలు ఉండటంతో.. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.
Must Read ;- వ్యాక్సిన్ తోనే.. కరోనాకు విరుగుడు!