TDP Leader Nara Lokesh Helps To Nagendraprasad Family :
ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ కొలువులు సాధించి తమ కుటుంబాలకు అండగా నిలవాలకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూశారు. కానీ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల ఊసే లేకపోవడంతో యువత తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్రప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. బీఈడీ పూర్తిచేసి టీచర్ ఉద్యోగం సాధించాలనే కోరిక నెరవేరలేదు. నాగేంద్ర ప్రసాద్ లాంటి నిరుద్యోగులు ఎంతోమంది నిరుత్సాహానికి గురవుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లయినా.. 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తమ బాధను వెళ్లగక్కుతున్నారు.
నారా లోకేశ్(Nara Lokesh) అండ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల పక్షాన నిలిచారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ లెస్ క్యాలెండర్ వల్ల నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతుండటంతో.. మానసిక ధైర్యం నూరిపోస్తున్నారు. ప్రతిపక్ష నేతగా తనవంతు సాయం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేంద్రప్రసాద్ తల్లికి సాయంగా రూ. 2 లక్షల చెక్ ను అందించి.. తానేంటో చాటుకున్నారు. ఏ తల్లికి ఇటువంటి కష్టం రాకుండా అంతా కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని నారా లోకేశ్ పిలుపు ఇచ్చారు.
Must Read ;- జగన్ డౌన్ డౌన్!.. హోరెత్తిపోతోంది!











