నిబంధనల ప్రకారం సర్వే చేయించి, ప్రభుత్వ స్థలాలు ఉన్నట్టు తేలితే ఏలాంటి చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు స్పష్టం చేసినా అధికారులు మాత్రం ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఈ ఘటనను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పల్లా ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు నిరూపించాలని, లేదంటే మంత్రి శ్రీనివాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి కూల్చడమే తప్ప కట్టడం తెలియదన్నారు. పల్లా కుటుంబసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. కక్ష్య సాధింపులు ఆపి, అభివృద్ధిపై పెట్టాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు.
Must Read ;- ఇక ’పల్లా‘ వంతు : కుటుంబీకుల ఆస్తులపై దాడులు