ప్రకాశం జిల్లా దర్శి నగరపంచాయతీని ‘తెలుగుదేశం’పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డులగానూ ఒక వార్డు ఏకగ్రీవం కాగా .. 19 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 19 వార్డులకు గానూ 12 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుని విజయ కేతనం ఎగరవేసింది. వరుసగా 3,4,10,12,12,13,14,15,18,19 వార్డుల్లో తెలుగుదేశం కౌన్సిలర్ అభ్యర్థులు ఘనం విజయం సాదించారు. 6 వార్డుల్లలో వైసీపీ గెలుపొందింది. టీడీపీ కైవసం చేసుకున్న ప్రతివార్డులో స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించింది. అయితే దర్శిలో గెలుపు కోసం అధికార వైసీపీ తొక్కరాని అడ్డదారులంటూ లేవు. అరాచకంగా విజయం సాధించాలని యత్నించిన అధికారపార్టీకి భంగపాటు తప్పలేదు. ఒకపక్క దర్శి నియోజకవర్గ ప్రధాన కేంద్రం.. అది అధికార సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు నియంతృత్వం ద్రోరణీల నడుమ టీడీపీ విజయం సాధించడం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి దర్శి నరగ పంచాయితీలో వైసీపీ ఎమ్మెల్యే వేణుగోపాలరావు సాగించి అరాచకాలు అన్నీఇన్నీకావు. అంతిమంగా దర్శి నగర పంచాయితీ ఎన్నికల్లో అధికారపార్టీ వత్తుళ్లు, వెధింపులను ఓపికగా భరిస్తూ .. ఎంతో స్థిత ప్రజ్ఞతతో తెలుగు దేశం విజయం సాధించిందని శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Must Read ;- మార్పు మొదలైంది..! మిగిలింది పతనమే!!