ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రైతులకు తమ మద్దతును తెలియజేశారు. అంతేకాదు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, కోమిటి రెడ్డి వెంకట రెడ్డి ఈ నిరసనలో పాల్లొని, ప్రభుత్వం ఆమోదించిన రైతు చట్టాల్ని వెనక్కు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అసలు ఇంత హఠాత్తుగా కాంగ్రెస్కు ఎందుకు వెళ్లారు అనుకుంటున్నారా? అదేనండీ.. టీపిసీసీ అధ్యక్ష ఎన్నిక. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చివరి అంకంకి చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏఐసిసి కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్నారు. ఇప్పటికే టిపీసీసీ అధ్యక్షుడి నిర్ణయం జరిగినట్లు తెలుస్తుంది. కానీ, నాయకులకు అభిప్రాయాన్ని చెప్పి వారి సలహాలు, సూచనలు తీసుకోవడానికి అధిష్టానం అందరినీ ఒకచోట చేర్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు, నిర్ణయం వెల్లడించిన తర్వాత ఎవరు కూడా వ్యతిరేకించకుండా ఉండాలనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఒకట్రెండురోజుల్లో కాంగ్రెస్ నుంచి అధికారక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Must Read ;- రేవంత్కి టీపీసీసీ.. ఇద్దరికి సీడబ్ల్యూసీ ?











