ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డిని అరెస్టు ఘటన మరవకముందే.. తాజాగా విజయవాడ పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దొండపాటి విజయ్ కుమార్ను అరెస్టు చేసిన విషయం వెలుగు చూసింది. మైలవరం ఏఎంసీ చైర్మన్ పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో పోలీసులు విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ప్రణవ్ గోపాల్ స్పందించారు. దళిత విద్యార్థి నాయకుడు దొండపాటి విజయ్ కుమార్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమన్నారు.
Must Read ;- బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్