సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సర్కారు వారి పాట చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ మహేష్ మరి కొంత మంది ఫైటర్స్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ కూడా దుబాయ్ వెళ్లి బాణీల్ని వినిపిస్తున్నారు.

తమన్ దుబాయ్ లో వెళ్లిన తర్వాత మహేష్ తో సెట్స్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమన్ ముసుగు ధరించి ఉన్నఫోటోను షేర్ చేశారు. సూపర్ స్టార్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ లో ఉన్నాను. ఆనాటి దూకుడు రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ 2010లో దుబాయ్ లో మహేష్ దూకుడు షెడ్యూల్ షూటింగ్ ఇదే స్థలంలో జరిగిందని గుర్త చేశారు. దూకుడు సినిమాకి కూడా తమనే సంగీతం అందించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ షార్జా మెలిహా పురావస్తు కేంద్రం పరిసరాల్లో షూటింగ్ జరుపుకుటుందని టీమ్ తెలియచేసింది. మహేష్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇక్కడ షూటింగ్ చేయడం నిజంగా ఓ ప్రత్యేకమైన అనుభవం. చారిత్రాక కథలతో ప్రాచుర్యం చెందిన స్థలమిది. అద్భుతమైన వినోద కార్యకలాపాలు.. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు నా ఫేవరేట్ నిలుస్తున్నాయి. అలాగే ఇక్కడ వారి ఆతిథ్యాన్ని అభినందిస్తున్నాను అంటూ మహేష్ సోషల్ మీడియాలో స్పందించి ఫోటోలను షేర్ చేశారు.
ఎడారిలో విడిది ఇంటిని నిర్మించడం.. అక్కడ వాహనం రెడీగా ఉండడం.. ఆ వాతావరణం చూస్తుంటే.. షూటింగ్ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతుందో అర్ధం అవుతుంది. ఇలా మహేష్, తమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న సర్కారు వారి పాట చిత్రం 2022లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- శేష్ ‘మేజర్’ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన మహేష్
Filming for #SarkaruVaariPaata at Sharjah's Mleiha (@discovermleiha) was truly a unique experience! The stories, amazing recreational activities, and stunning landscapes will stay my favorite for a long time to come! Appreciate the warmth and hospitality 🙏🙏 pic.twitter.com/4YxH25T1AG
— Mahesh Babu (@urstrulyMahesh) February 5, 2021











