పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు అతివేగంతో ఢీకొన్నాయి. సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో మిల్లత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ సంఘటనలో 30 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరికొంత మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు, స్థానికులు పలు ఆస్ప్రతులకు తరలించారు. రెండు రైళ్లలోని బోగీల్లో మరికొంత మంది చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. పాక్ లో సరైన సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.
Must Read ;- విశాఖలో మరో ప్రమాదం : సింహాచలం సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం