తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ, బీజేపీ నాయకులు ట్విటర్లో వ్యంగాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ రోజు పవన్ కల్యాణ్ను సోము వీర్రాజు పొగిడిన విషయాలను టార్గెట్ చేస్తూ తిరుపతిలో డిపాజిట్లు వస్తే చాలని, జనం చెవిలో క్యాబేజి పూలు పెట్టండి అంటూ విజయపాయి ట్వీట్ చేశారు. దీనికి సోము వీర్రాజు స్పందిస్తూ కోర్టులకు చెవులో పూలు పెడుతూ బయట తిరుగుతున్నారని, తిరుపతి ప్రజలకు తాము ఏ చేశామో చెప్పి క్యాబేజి పూలు మీకే పంపుతామని, బెయిల్ రద్దయిన తర్వాత కూర వండుకోవచ్చంటూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు.
Must Read ;- తిరుపతిలో రత్నప్రభ నామినేషన్.. జనసేన నేతలు దూరం
తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు. pic.twitter.com/1sNKt3vU0s
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 29, 2021
మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!!
కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి. https://t.co/zBBj1GoOm7
— Somu Veerraju (@somuveerraju) March 29, 2021