సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ లైగర్. ఈ పాన్ ఇండియా మూవీని పూరి, ఛార్మి, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత పూరి చేస్తున్న సినిమా కావడంతో లైగర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది కానీ.. లేకపోతే ఈపాటికే లైగర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఆమధ్య రిలీజ్ చేసిన లైగర్ ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
దీంతో అటు విజయ్ అభిమానులు ఇటు పూరి అభిమానులు లైగర్ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అలాగే లైగర్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో లెజెండరి మాజీ ఆటగాడు, బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్ టైసన్ క్లైమాక్స్ యాక్షన్ సీన్లో అతిథి పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి లైగర్ పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్తో ఈ యాక్షన్ మూవీ రూపొందుతోంది.
ప్రస్తుతం లైగర్ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ మరియు కొంత మంది ఫైటర్స్ పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విధి నన్ను, పూరి జగన్నాథ్, ఛార్మిని కలిపింది. మేం ముగ్గురం ఒక్కటే ఫిక్స్ అయిపోయాం. లైగర్ మూవీతో ఇండియాని ఊపేయాలని.. ఖచ్చితంగా లైగర్ తో షేక్ చేస్తాం. 2022లో అది జరుగుతుంది అన్నారు. మరి.. 2022లో లైగర్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.