May 20, 2026 10:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పేదలకు ‘పట్టా’భిషేకం :  వైభవంగా సెంటు భూమి పంపిణీ

రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.

December 25, 2020 at 6:36 PM
in Andhra Pradesh, Latest News
House Sites to Poor Scheme Launched by AP CM YS Jagan Mohan Reddy

House Sites to Poor Scheme Launched by AP CM YS Jagan Mohan Reddy

Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో  మూడు పండుగలు ఒకేరోజు వచ్చాయి.  క్రిస్మస్, ముక్కోటి ఏకాదశితోపాటు జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ  ఏపీ ప్రజలు ఈ మూడు పండుగలను ఒకే రోజు జరుపుకుంటున్నారు. ఆరుసార్లు వాయిదా పడినా,  ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పేదలకు సెంటు భూమి పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరి నుంచి ప్రారంభించారు. ఈ పండగ పది రోజుల పాటు జరగనుందని సీఎం స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలతోపాటు మొదటి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా సీఎం శ్రీకారం చుట్టారు. కొమరిగిరిలో లే అవుట్ చూస్తుంటే మేము నిర్మించేది కాలనీలు కాదు ఊర్లేనని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

గృహమే కదా స్వర్గసీమ  

పాదయాత్రలో ఎంతోమంది పేదలు సొంత ఇళ్లు లేకపోవడం చూశానని అందుకే ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా ఇవాళ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించినట్టు సీఎం స్పష్టం చేశారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామని సీఎం చెప్పారు. పేదలకు ఇచ్చిన సెంటు భూమి విలువ ప్రస్తుతం రూ.4 లక్షలు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రకారం పేదలందరికీ ఇళ్లు ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా ఇళ్లు నిర్మించి, వాటిని కూడా సరిగా పూర్తి చేయలేదని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

నవ సమాజం కోసం…

కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నట్టు సీఎం కొమరగిరి సభలో ప్రకటించారు. అన్ని కులాలు, మతాలు కలసిమెలసి ఉండటం వల్ల నవ సమాజానికి బాటలు పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 175 నియోజకవర్గాల్లో 17500 కాలనీలు వస్తున్నాయని, ఏపీ జనాభాలో నాలుగోవంతు మంది రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ కాలనీల్లో నివసిస్తారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఒక్కరూపాయి ఖర్చు లేకుండా ఇళ్లు నిర్మించి ఇస్తాం…

పేదలకు ఇళ్ల స్థలంతోపాటు, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ముడి సరకు, కూలీ ఖర్చులు ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బును దశలవారీగా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పది రోజులతో అయిపోదని, ఇది సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్నారు.

స్వార్థపరుల వల్లే డి పట్టా

కొందరు స్వార్థపరుల వల్లే పేదలకు డి పట్టా ఇవ్వాల్సి వస్తోందని సీఎం ప్రతిపక్షాలను తప్పుపట్టారు. ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పోరాడుతోందని సీఎం కొమరగిరి సభలో వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమం చూసి పసుపురంగు నేతల కళ్లు ఎరుపెక్కుతున్నాయని టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు. అమరావతిలో పేదలకు 54 వేల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, ప్రతిపక్షాలు కోర్టులో స్టేలు తెచ్చారని విమర్శించారు.

కోర్టు స్టేల వల్ల పది శాతం ఇళ్ల స్థలాల పంపిణీ ఆగిపోయిందని సీఎం గుర్తుచేశారు. ఇవాళ పంపిణీ చేస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ ఆపాలని కొందరు స్వార్ధపరులు కోర్టులో పిల్ వేశారని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు రూ.3 వేల కోట్లు చెల్లించకుండా వెళ్లిపోయిందని, అయినా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయికే పేదలకు ఉచితంగా ఇళ్లు ఇస్తున్నామని సీఎం ప్రకటించారు.

ఇచ్చింది పట్టాలు కాదు పొజిషన్ సర్టిఫికెట్లు మాత్రమే

ఏపీలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఊదరగొడుతున్న సీఎం, పేదలను మోసం చేసి వారికి పట్టాలు ఇవ్వకుండా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పేదలకు సెంటు భూమి పేరుతో భూముల కొనుగోళ్లలో రూ.4 వేల కోట్లు, మెరకవేసే పనుల్లో రూ.2 వేల కోట్లు, ఇక పేదల నుంచి రూ.500 కోట్లు వైసీపీ నేతలు దండుకున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో 45 మంది ఎమ్మెల్యేలు భూముల కొనుగోళ్లలో తీవ్ర అవినీతికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ విమర్శించారు.

Also Read: విజయనగరం మసాలా : బాబు డైరెక్షన్, అచ్చెన్న యాక్షన్!

Tags: andhra pradeshap govt housing schemehouse pattas in Andhra PradeshJagan housing scheme for poorleotopNavaratnaluPedalandariki IlluPolitical NewsYS Jagan Mohan ReddyYSR Housing SchemeYSR Pedakandariki Illu
Previous Post

ఫైజర్ టీకా టెక్నాలజీ ‘ఎంఆర్‌ఎన్‌ఏ’ సృష్టికర్త గురించి మీకు తెలుసా?

Next Post

ఈ ‘దివి’ లో విరిసిన అందాల పారిజాతం

Related Posts

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

కంగనా ట్వీట్ పై భగ్గుమన్న విపక్షాలు

ఢిల్లీకి సెగ తాకేలా.. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రతరం

‘కింగ్ మేకర్’ టైటిల్ నే ఖాయం చేస్తారట !

Captivating pictures of Aabha Paul are sweeping the internet

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist