రాజకీయాలు చాలా ఖరీదైన వ్యవహారంలా మారాయి. ప్రజల్లో తమకు ఏ స్థాయిలో సపోర్ట్ ఉందో చూపించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంతైనా పెట్టడానికి వెనుకాడటం లేదు. అధికార పార్టీ నేతలైతే కోట్లను కూడా ఉఫ్ మని ఊదేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సభలు చూస్తే పోలిటిక్స్ ఎంత్ కాస్ట్లీగా మారయే అర్ధమవుతుంది. సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న ఒక్కో సభకు ఎంత ఖర్చవుతుందో తెలుసా.. మీటింగ్కు వచ్చే జనాలకు ఎంత ఇస్తారు.. విందు, మందు కోసం ఎంత వెచ్చిస్తారో తెలుసుకోవాలని ఉందా..
ఏపీలో ఎన్నికల హడావుడి తారా స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష నాయకులు పోటా పోటీ సభలతో.. వేదికపై నుంచే టీవీల్లో, సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ప్రతిపక్షాలు పెద్ద సంఖ్యలో సభలు నిర్వహిస్తుంటే.. అధికార పార్టీ మాత్రం భారీ స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదని చూపించుకోవడానికి సీఎం జగన్ ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. సిద్ధం సభలు చూసిన వాళ్లెవరికైనా ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దగ్గర్నుంచి.. సభకు హాజరయ్యే జనాల కోసం ఏర్పాటు చేసే బస్సుల వరకూ రవాణా ఖర్చులకే పదుల కోట్లు ఖర్చు పెడుతున్నారు.
రాయలసీమ వైసీపీకి బలమైన పట్టున్న ప్రాంతం. ఐదేళ్ల జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోవడం, అభివృద్ధి ఆగిపోవడం, గుంతల రోడ్లు, భారీగా పెరిగిన ధరలతో సీమలోనూ అధికార పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. వాస్తవాలు ఎలా ఉన్నా.. తమకు తిరుగులేదని చెప్పుకుంటారు ఏపీ సీఎం జగన్. సీమలో వైసీపీ బలం తగ్గలేదని నిరూపించుకోవడానికి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభను వేదికగా చేసుకున్నారు. భారీగా జనసమీకరణ చేశారు. సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులను రాప్తాడు సభ కోసం తరలించారు.
ఏపీఎస్ ఆర్టీసీలో సొంత, అద్దె బస్సులన్నీ కలిపి పదివేల వరకూ ఉంటాయి. గుంటూరు నుంచి అనంతపురం వరకూ ఉన్న 13 జిల్లాల్లో సుమారు 5 వేల బస్సులు ఉంటాయి. వీటిలో మూడు వేల బస్సులు జగన్ సభ కోసం కేటాయించారు ఆర్టీసీ అధికారులు. ఇందుకోసం జగన్ పార్టీ రోడ్డు రవాణా సంస్థకు 10 కోట్లు చెల్లించింది. ఇక ప్రైవేట్ బస్సులూ అదే స్థాయిలో సమీకరించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆర్టీసీకి డబ్బులు ఇచ్చారు. మరి ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులు తీసుకున్నా వారికి పెట్రోల్ ఖర్చులకైనా ఇచ్చారో లేదో తెలియదు.
సీఎం జగన్ పబ్లిక్ మీటింగ్కు వచ్చిన వారికి ఒక్కొక్కరికీ కనీసం 500 రూపాయల నగదుతో పాటు విందు, మందు ఖర్చంతా అధికార పార్టీ నాయకులే భరిస్తున్నారట. ఈ సభకు రెండు లక్షల మంది వచ్చారనుకుంటే.. వాళ్లకు డబ్బు రూపంలోనే పది కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భోజనాలు, మందు సీసాలకు మరో వెయ్యి రూపాయలైన ఖర్చవుతుంది. ఇదంతా కలిపి ఇంకో 20 కోట్ల లెక్క తేలుతుంది. బస్సులకు, విందు, మందు వరకే 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇవి గాక సభా ప్రాంగంణంలో బారికేడ్లు, కుర్చీలు, మైకులు, టెంట్లు, సభావేదిక నిర్మాణం వంటి వాటికీ భారీగానే పెట్టాలి. సీఎం హెలికాప్టర్కీ కోట్లలో చెల్లించాలి. ఆయన వెంట వచ్చే ముఖ్య నేతలకు, స్థానిక నాయకులకు దక్షిణల కింద ఎంత సమర్పించుకొంటున్నారో చెప్పడం కష్టం. అంటే ఒక్క సభ నిర్వహించాలన్నా జగన్ పార్టీకి తడిసి మోపెడు అవుతుందన్న మాట. కానీ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు క్షణం కూడా ఆలోచించకుండా భారీ బహిరంగ సభలకు సిద్ధం అంటున్నారు.
ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే ఇంత ఖర్చు పెడుతున్నారంటే.. ప్రచారం పూర్తయ్యే నాటికి వేల కోట్లు కుమ్మరించడం ఖాయం. పేదల ప్రతినిధిని అని చెప్పుకొనే ఏపీ సీఎం జగన్.. తన ప్రచారానికి వందలు, వేల కోట్లు తగలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమలుతున్న సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కేటాయించే మొత్తం కంటే.. ఎన్నికల ప్రచారానికి వైసీపీ పెట్టే ఖర్చే ఎక్కువ అని ఆర్ధిక నిపుణుల అంచనా. వైసీపీ అధినేత జగన్ తన సొంత కంపెనీల్లో షేర్లు అమ్ముకోవడం లేదు.. అధికార పార్టీ నాయకుల ఆస్తులు కరిగిపోవడం లేదు.. అయినా ఇంత డబ్బు కుమ్మరిస్తున్నారంటే.. అదంతా ప్రజల డబ్బే అని స్పష్టం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.