సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలెంట్ని క్యాష్ చేసుకొని ఓట్లు దండుకోవాలని స్కెచ్ వేసింది వైసీపీ. గత ఎన్నికలకు ఆ పార్టీకి చెందిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కించారు.. ఈ మూవీ ఎన్నికలకు ముందు కొంత ప్రభావం చూపింది.. టీడీపీపై బురద చల్లడానికి ప్రయోగించిన ఈ అస్త్రం కొంతమేరకు ఆ పార్టీకి లాభించింది.. ఇదే ఆశతో ఈ దఫా ఎన్నికలలోనూ వర్మతో ఏకంగా రెండు భారీ సినిమాలను ప్లాన్ చేసింది.. ఒకటి వ్యూహం, మరొకటి శపథం పేరుతో రెండు సినిమాలను తక్కువ వ్యవధిలో విడుదల చేసేందుకు వ్యూహం రచించింది..
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ రాజకీయాలలో జరిగిన పరిణామాలే ఈ రెండు పార్ట్లకి ప్రేరణ. కేవలం జగన్ని, ఆయనలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం, ప్రత్యర్ధులపై బురద చల్లడం.. ఇదే ఈ సినిమాలోని కీ పాయింట్స్.. అయితే, కమ్మరాజ్యంలో.. సినిమాతో వర్మ టేకింగ్, మేకింగ్పై ఆడియెన్స్లో ఒక అభిప్రాయం వచ్చేసింది.. స్కిట్కి ఎక్కువ సినిమాకి తక్కువ అనే కామెంట్స్ వినిపించాయి.. వర్మ పతనాన్ని కళ్లారా చూపించింది ఈ మూవీ..
తాజాగా విడుదలయిన వ్యూహం ట్రయిలర్ తరవాత వర్మపై ఆశలు వదులుకుందట జగన్ టీమ్.. అంతన్నాడు, ఇంతన్నాడే గంగరాజు అనే పాటను గుర్తు చేసుకుంటున్నారట. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ట్రయిలర్ అంచనాలకు దూరంగా ఉండడం, మరోసారి కమ్మరాజ్యంలో సీన్లను తలపించడంతో వర్మకి భారీ మనీ ఇచ్చి ఔట్ సోర్సింగ్ చేయిస్తోన్న ఆ రెండు సినిమాలు ఇక బూడిదలో పోసిన పన్నీరుగా మారడం ఖాయంగా కనిపిస్తోందని ఓ నిర్ణయానికి వచ్చారట.. ఇటు ట్రయిలర్ సైతం యూ ట్యూబ్లో మిలియన్ వ్యూస్ దక్కించుకోకపోవడం విశేషం..
వర్మ తన యూ ట్యూబ్ చానెల్స్లో గత కొన్ని రోజులుగా నిజం పేరుతో నిర్వహించిన షోలోని కీలక టాపిక్స్, ఎనలిస్టుల బైట్స్, వారి విశ్లేషణలే ఈ సినిమా ట్రయిలర్ అద్భుతంగా ఉందనే కామెంట్స్ పడుతున్నాయి.. దీంతో, వైసీపీకి కూడా తత్వం బోధపడిందట. ఇక వర్మను పట్టుకొని ఈ ఎన్నికల గోదారిని ఈదడం కష్టం అనే వైసీపీ నేతలే పెదవి విరుస్తున్నారు.. మరి, జగన్ టీమ్ ఈ వర్మ గాయానికి ఎలాంటి మందు వేసుకొని ముందుకు వస్తుందో చూడాలి..