విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి చేపట్టిన ‘విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర’కు అశేష జనసేనాని కదిలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారని వైసీపీ పార్టీ పేర్కొంది. అధికారక ట్విట్టర్ ద్వారా విజయసాయిరెడ్డి పాదయాత్ర ఫొటోలను షేర్ చేస్తూ..‘ జనసంద్రమైన కంచరపాలెం. కిక్కిరిసిన జనం మధ్య ముందుకుసాగుతున్న రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్రకు సంఘీభావంగా పెద్దఎత్తున ఎదురేగి ఘన స్వాగతం పలుకుతున్న స్థానిక ప్రజానీకం.’ అంటూ వైసీపీ పేర్కొంది.
-జనసంద్రమైన కంచరపాలెం.
-కిక్కిరిసిన జనం మధ్య ముందుకుసాగుతున్న రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి
-స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పాదయాత్రకు సంఘీభావంగా పెద్దఎత్తున ఎదురేగి ఘన స్వాగతం పలుకుతున్న స్థానిక ప్రజానీకం. @VSReddy_MP pic.twitter.com/v8lIRObWvm— YSR Congress Party (@YSRCParty) February 20, 2021
Also Read ;- విజయసాయిరెడ్డి పాదయాత్ర.. అసలెందుకో?