నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో.. దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా కరోనా ఎదుర్కొన్నాయని.. రాష్ట్రాల కృషిని పొగిడారు మోడీ. 2014 తర్వాత2.40 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరిగాయని వివరించారు. కొత్త టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరిగాయని వివరించారు.
అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కేంద్ర పాలన ముందుకు సాగుతుందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు.
Speaking at the Governing Council Meeting of @NITIAayog https://t.co/SexLuKgCLw
— Narendra Modi (@narendramodi) February 20, 2021
ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ సూత్రంతో దేశం ముందుకు సాగుతుందని నీతి ఆయోగ్ సమావేశంలో మోడీ పేర్కొన్నారు. స్టార్టప్, చిన్న తరహా దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రులకు సూచించారు. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులిచ్చామన్నారు. రాష్ట్రాలు కూడా మౌలిక వసతుల పట్ల దృష్టి పెట్టాలని.. వాటిని మెరుగుపరచడానికి నిధుల కేటాయింపులు పెంచాలని సీఎంలకు సూచించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నుంచి సిఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొ న్నారు. కానీ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్, మమతా బెనర్జీ హాజరు కాకపోవడం గమనార్హం.
Must Read ;- బడ్జెట్ : ఆశలు కూలాయి.. భయాలు పెరిగాయి











