విజయసాయిరెడ్డి పాదయాత్ర చేపట్టారండోయ్.. ఎందుకు అనుకుంటున్నారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా.. కర్మాగారాన్ని పరిరక్షించడానికి పోరాట యాత్ర చేస్తారంట విజయసాయి గారు. దాదాపు 25 కిలో మీటర్లు యాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. జీవిఎంసీ మహాత్మ గాంధీ విగ్రహాం దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు పాదయాత్ర చేపట్టాలని విజయసాయి నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ రూప్ మ్యాప్ తయారుచేసుకున్నారు.
అసలెందుకీ పాదయాత్ర?
పాతయాత్ర కొత్త ట్రెండేమీ కాదు.. మైలేజీ తగ్గుదుందనో.. లేదా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందనో అనిపించిన మరుక్షణం నాయకులు ఎంచుకునే తారకమంత్రం పాదయాత్ర. ఇప్పుడు అదే మంత్రాన్ని విజయసాయి రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అసలెందుకీ పాదయాత్ర.. దీని వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ఎలా రక్షించబడుతుంది అంటే సమాధానం చెప్పడం కష్టమే.
విశాఖ స్టీల్ సంగతి కాస్త పక్కన పెడితే.. రాజకీయ లబ్ధి కోసమే ఈ పాదయాత్ర ప్లాన్ వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశాఖను పోస్కోకు కట్టబెడుతున్నారని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా పోస్కో కంపెనీ వాళ్లు ముఖ్యమంత్రిని కలిశారని స్వయంగా జగన్ గారే ఒప్పుకున్నారు. వాళ్లు కలిసింది వేరే కారణాలు అని చెప్పినా.. అందరిలో పలు అనుమానాలు మాత్రం వస్తున్నాయి. వీటిన్నంటినీ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా విజయసాయి పాదయాత్ర చేపట్టారని చెప్పచ్చు. రాష్ర్ట ప్రభుత్వం విశాఖ స్టీల్ పట్ల చిత్తశుద్ధితో ఉందని.. అందుకోసమే కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టాము చూడండి అని ప్రజలలో మైలేజ్ తెచ్చుకోవాడానికే అన్నది విశ్లేషకులు అభిప్రాయం.
Must Read ;- అమరావతి నుంచి.. విశాఖ ఉక్కు వరకు.. రావణ కాష్ఠంలా జగనన్న రాజ్యం!
ఎన్నికలు కూడా ఉన్నాయిగా..
మూడు రాజధానుల ఆటలో.. విశాఖకు కూడా స్ధానముంది.. అసలే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం విశాఖలో ఏమాత్రం సీట్లను కోల్పోయినా.. ప్రతిపక్షాల మాటే నిజమవుతుందనే భయం కూడా ఉంది అధికార పార్టీలో.. అందుకే పాదయాత్ర పేరుతో కార్యకర్తలు.. స్థానిక అధికారులను సమాయత్తం చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా విశాఖలో అఖండ విజయాన్ని అందుకుని.. ప్రభుత్వ రాజధానుల నిర్ణయాన్ని విశాఖ ప్రజలు అంగీకరిస్తున్నారని చెప్పుకోవడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో విశాఖ ఉక్కు ఉద్యమం.. అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఇక దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కుదరదు. అందుకే పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీసీ ఎన్నికల పబ్బం గడుపుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు.
కేంద్రాన్ని పన్నెత్తు మాట అనరు..
ఎన్ని ప్రసంగాలు చేసినా.. పోరాటయాత్రలకు పూనుకున్నా.. కేంద్రాన్ని మాత్రం పన్నెత్తు మాట అనేంత ధైర్యం చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏమన్నా అంటే జైతే గతి అని భయపడుతున్నారో ఏమో.. పాపం.. అధికార పార్టీ నాయకులు. విశాఖ ఉక్కు విషయంలో అధికారమంతా కేంద్రానిదే అని అందరికీ తెలుసు. మరి మన హక్కును కాలరాస్తున్న కేంద్రాన్ని కనీసం నిలదీసే ధైర్యం కూడా చేయని వారు పోరాటయాత్ర పేరుతో పాదయాత్ర చేయడం దేనికో మరి. ఇది విశాఖ ఉక్కు కోసమా.. భూముల కోసమా.. రానున్న ఎన్నికల కోసమా.. అని ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Also Read ;- మాటలకు చేతలకు ఉండని పొంతన.. విశాఖలో వైరస్ యాత్ర..!!











