కరోనా బాధితుల కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ 2డీజీ ఔషధాన్ని రూపొందించింది. ఈ ఔషధాన్ని ఎలా వినియోగించాలో వివరించింది. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులకు, 18 ఏళ్ల లోపు వాళ్లకు ఇవ్వకూడదని తెలిపింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని తెలిపింది. డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లపై ఈ ఔషధాన్ని పరీక్షించలేదు. ఈ మందు అత్యవసర వినియోగానికి మే 1న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.
Must Read ;- ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఆందోళనకరంగా బ్లాక్ ఫంగస్











