ఒకటి తర్వాత ఒకటి, ఏలూరు.. గుంటూరు.. ఇప్పుడేమో కర్నూలు.. ఇక్కడ కనీసం కారణమైన తెలియడం అదృష్టం. కర్నూలు కొసిగి మండలం, సజ్జలగూడెం, జంపాపురం గ్రామాలలోని ప్రజలు కలుషిత నీరు తాగడం వల్ల అస్వస్థత గురవుతున్నారు. దాదాపు ఐదు రోజుల నుండి ఇక్కడి ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గ్రామాలకు నీటిని అందించిందే వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకుండానే నీటిని సప్లై చేయడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఐదు రోజులుగా గ్రామాల్లోని ప్రజలు ఆసుపత్రిల్లో చేరుతున్నా కూడా సంబంధిత వైద్యాధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సరైన వైద్యం అందక ఆర్ఎంపి డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. తక్షణం పరిస్థితిని సమీక్షించి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
Must Read ;- ఏలూరు వింత వ్యాధిపై సర్కారు విచిత్ర వాదన..!