నేచురల్ స్టార్ నానీ సినీ కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా ‘జెర్సీ’. ఒక క్రికెటర్ తన తనయుడి కోరిక తీర్చడం కోసం తన లైఫ్ నే పణంగా పెట్టిన కథతో ఈ సినిమా రూపొందింది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డ్ సైతం అందుకున్న ఈ సినిమాను బాలీవుడ్ లో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీదుంది.
జెర్సీ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఆఫర్స్ బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ దర్శకుడు మరో అద్భుతమైన కథతో మరోసారి నానీ హీరోగా సినిమా తెరకెక్కించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. గౌతమ్ కథకు నానీ ఇంప్రెస్ అయ్యాడట. త్వరలోనే ఈ కాంబో మూవీ గురించి ప్రకటన వెలువడనుందని టాక్. ఈ ఏడాది దీపావళి స్పెషల్ గా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందట. మరి ఈ సారి నానీ గౌతమ్ .. ఎలాంటి సెన్సేషన్ కు రెడీ అవుతారో చూడాలి.
Must Read ;- ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ వదిలేది అప్పుడే.. !











