వైసీపీ కార్యకర్తలు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా చెర్లోపల్లికి చెందిన ఓ ఆశా కార్యకర్త సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించింది. వైసీపీ నాయకుల లైంగిక వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు ముందు బోరుమంది. గ్రామానికి చెందిన నలుగు వైసీపీ కార్యకర్తలు ప్రతిరోజు లైంగికంగా వేధిస్తున్నారని, మాట వినకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని బెదిరించినట్లు ఆమె తెలిపారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొంది. ఆశా కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు మండిపడుతున్నారు. బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Must Read ;- చంద్రబాబుపై రాళ్ల దాడి.. తేల్చుతారా.. తేల్చేశారా?











