The First Song from RRR Movie :
ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ తాజా అప్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 1వ తేదీ ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు మొదటిపాట విడుదలవుతుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల స్నేహం గురించి మొదటి పాట ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దోస్తీ అంటూ వారే ఓ క్లూ కూడా ఇచ్చారు. మరో ఐదు రోజుల్లో విడుదల కాబోయే ఈ పాట కోసం ఇద్దరు హీరోల అభిమానులూ ఎదురుచూస్తున్నారు.
సినిమా ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేటుకు లహరి మ్యూజిక్ సొంతం చేసుకుంది. అక్టోబరు 13 న ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆడియో విడుదల తేదీ కూడా ఖరారైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని ఈ సినిమా ఆడియో హక్కులను లహరి సంస్థ సొంతం చేసుకుంది. హిందీ ఆడియో రైట్స్ ను బాలీవుడ్ కు చెందిన ఆడియో సంస్థ సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉంటాయనే విషయంతో ఇంకా స్పష్టత లేదు.
Must Read ;- రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అదిరింది.. సరికొత్త రికార్డులు ఖాయం

ఈ హక్కులు ఎంతకు అమ్ముడు పోయాయన్నది తెలియలేదు. భారీ తారగాణంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ ను ఇస్తూ నిర్మాణ సంస్థ వస్తోంది. మొదటిపాట విడుదలపై కూడా స్పష్టత వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉందని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం ప్రత్యేకమైన ప్రమోషనల్ సాంగ్ ను రూపొందించారు. దీని షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రమోషన్ మీద దృష్టిపెట్టారు. థియేట్రికల్, ఓటిటి హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. పాత రికార్డును దాటి ఈ హక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. లహరి సంస్థ విషయానికి వస్తే ఇంతకుముందు బాహుబలి ఆడియో హక్కులను కూడా ఈ సంస్థ సొంతం చేసుకుంది. అందుకే ఈసారి కూడా భారీ మొత్తాన్ని చెల్లించి ఈ ఆడియో హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం.











