విజయవాడలోని సాయికృష్ణ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని ఇల్లు, గుంటూరు కార్యాలయం.. స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. అందుకోసం 6 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. 4 గంటలుగా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. సాయికృష్ణపూ అందిన కీలకమైన సమాచారమే అందుకు కారణమని తెలుస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే సమాచారంతో ఏక కాలంలో ఇంటితో పాటు, కార్యాలయం, స్నేహితుల ఇళ్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.
Must Read ;- విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఏసీబీ షాక్