ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఇవాళ వర్చువల్గా భేటీ అయింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్దన్ రెడ్డి నేతృత్వంలో వర్చువల్గా సమావేశం అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్పై మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్పై చర్చించారు. స్పీకర్ తమ్మినేనికి మెయిల్ ద్వారా అందిన ప్రివిలేజ్ పిటీషన్ను ఛైర్మన్కు పంపారు. అసెంబ్లీ రూల్ నెం.212,213 ప్రకారం ఎస్ఈసీని పిలిపించవచ్చని సభ్యులు తెలిపారు.
మహారాష్ట్రలో కూడా ఇలానే..
మహారాష్ట్రలో కూడా ఇలానే ఒకసారి జరిగిందని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు గుర్తు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కె ప్రకారం కమిషన్కు సర్వాధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు రాష్ట్ర ఎన్నికల కమినర్ను ప్రివిలేజ్ కమిటీ ముందుకు ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. వర్చువల్గా కాకుండా మరో వారంలో నేరుగా సమావేశం కావాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎస్ఈసీ రాజ్యాంగ బద్ద సంస్థ కావడంతో దీనిపై న్యాయినిపుణులతో విస్తృతంగా చర్చించాలని కమిటీ నిర్ణయించింది.
Must Read ;- స్థానిక ఎన్నికలకు సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి.. గవర్నర్ను కోరిన నిమ్మగడ్డ