ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాలెంట్రీ అవార్డులు పొందన వీర జవాన్లకు ఆర్థిక సాయం పెంచుతున్నట్లు ప్రకటించింది. పరమవీర చక్ర, అశోక చక్ర పొందినవారికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచారు. మహావీర చక్ర, కీర్తి చక్ర లకు రాష్ట్రం అందిస్తున్నది 8 లక్షలు, దాన్ని ఇకపై 80 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీర్ చక్ర, శౌర్య చక్ర పొందిన వారికి, గతంలో ప్రభుత్వం 6 లక్షలు అందించేది. దాన్ని ఇప్పుడు 60 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకాలు ఏపీకి చెందిన వారికి మాత్రమే వర్తిస్తుందని తమ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Must Read ;- పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు