ప్రత్యేక డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ లలిత ఇరువర్గాల వాదనలు విన్నారు. తీర్పును రిజర్వులో ఉంచారు. మెడికల్ బోర్డు రిపోర్టు కూడా హైకోర్టుకు అందడంతో ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఈ కేసులో వాదనలు ప్రారంభించారు. ఇరువర్గాల వాదనలు గంటకుపైగా కొనసాగాయి. అయితే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
జైలుకు ఎందుకు తరలించారు
హైకోర్టు ఆదేశాలు దిక్కరించి రఘురామరాజును జైలుకు ఎందుకు తరలించారని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు, సీఐడీ కోర్టు ఆదేశాలను ప్రభుత్వం దిక్కరించిందని రఘురామరాజు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను దిక్కరించి రఘురామరాజును జైలుకు తరలించారని, ఆయనకు ప్రాణహాని ఉందని న్యాయవాదులు ధర్మాసనం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ప్రత్యేక డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వులో ఉంచింది.
Must Read ;- ఈ రోజు రాత్రి నా భర్తను చంపేందుకు కుట్ర : రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్