హైటెక్ యుగంలోనూ అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చేయని తప్పుకు ఇద్దరు మైనర్ పిల్లలపై దాడి చేశారు. చేతులు కట్టేసి, ఆవు పేడ తినిపించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని సాయినగర్లో చోటుచేసుకుంది. బుడగ జంగాలకు చెందిన ఇద్దరు పిల్లలు, తప్పిపోయిన కుక్క కోసం వెతుకులాడారు. వెతుకులాటలో భాగంగా వీరభద్రరావుకు చెందిన మామిడి తోటలోకి వెళ్లారు. మామిడి కాయలు దొంగిలించడానికే వచ్చారంటూ, అక్కడ పనిచేసేవాళ్లు పిల్లలను చిత్రహింసలకు గురిచేశారు. చేతులు కట్టేసి, బలవంతంగా పేడ తినిపిస్తూ క్రూరంగా ప్రవర్తించారు. దాడి చేసిన బానోత్ యాకు, బానోతు రాములుపై కేసు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. అయితే పిల్లలపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, బాధితులను కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
also read:వరంగల్ రాజకీయంలో ఎర్రబెల్లికి ఎదురుదెబ్బలు