సినీ జర్నలిస్ట్, రచయిత భగీరథ రచించిన “భారతమెరికా” పుస్తకాన్ని శుక్రవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి బహుకరించారు. హైదరాబాద్ నివాసంలో ఆయన్ని కలసి తన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి కి బహుకరించానని, ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని భగీరథ తెలిపారు.
2014లో తన అమెరికా పర్యటన వివరాలతో పాటు 12వ శతాబ్దము నుంచి భారత దేశ చరిత్రను క్రోనాలాజికల్ ఆర్డర్ లో వ్రాయడం జరిగిందని, అలాగే నన్నయ్య యుగం నుంచి తెలుగు సాహిత్య పరిణామ క్రమాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని ఉప రాష్ట్రపతి కి వివరించినట్టు భగీరథ చెప్పారు. ఒక మంచి పుస్తకాన్ని బహుకరించినందుకు భగీరధను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు.
Also Read:విజయసాయి రెడ్డి.. వెంకయ్యనాయుడుని ఎంత మాట అన్నారు..!