ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ఎక్కడ పుట్టిందో నిగ్గు తేల్చి,90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆ దేశ నిఘా వర్గాలను ఆదేశించారు.చైనాలోని వూహాన్ చేపల మార్కెట్లో పుట్టిందని కొందరు,కాదు వూహాన్ వైరాలజీ ల్యాబ్లో పుట్టిందని మరికొందరు ఏడాదిన్నరగా వాదించుకుంటున్న సమయంలో బైడెన్ దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని నిఘా వర్గాలను ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది.కోవిడ్ వైరస్ చైనా చెబుతున్నట్టు వూహాన్ చేపల మార్కెట్లో పుట్టిందా,సహజసిద్దంగా తయారు చేశారా? అనేది ఇంత వరకు ఎవరూ నిగ్గు తేల్చలేకపోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్ర దర్యాప్తు తొలి దశ పూర్తి అయినా కూడా ఓ నిర్ణయానికి రాలేకపోయింది.దీంతో కోవిడ్ ఎక్కడ పుట్టిందో తేల్చాలని అమెరికా నిఘా వర్గాలను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు.
ఖచ్చితమైన సమాచారం ఇవ్వండి..
కోవిడ్ 19 పుట్టుక గురించి ఖచ్చితమైన నిర్ధరణకు వచ్చేందుకు అవసరమైన సమాచారం సేకరించడానికి, విశ్లేషించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బైడెన్ ఆదేశించారు.90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా డెడ్ లైన్ పెట్టారు.చైనాలోని వూహాన్ చేపల మార్కెట్ నుంచి కానీ లేదా వూహాన్లోనే ఉన్న వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ ప్రమాదవశాత్తూ లీకైందా అనే విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు నిగ్గు తేల్చనున్నాయి.కరోనా మహమ్మారికి చైనాయో కారణమని రిపబ్లికన్లు ప్రచారం చేసుకోవడం కూడా డ్రాగన్ కంట్రీకి చిక్కులు తెచ్చిపెట్టింది.
మూలాలు నిగ్గు తేల్చండి
కోవిడ్ మూలాలు నిగ్గు తేల్చాలని అమెరికా అధ్యక్షుడు ఆదేశించినట్టు వైట్ హౌస్ ప్రకటించింది.గత మార్చిలోనే బైడెన్ ఆదేశించినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందా? లేక ప్రమాద వశాత్తూ ల్యాబ్ నుంచి లీకైందా? అనే రెండు విషయాలపై నిఘా వర్గాలు మరింత లోతైన సమాచారం సేకరించనున్నాయి.కోవిడ్ మూలాలపై అమెరికా నిఘా వర్గాలు కూడా రెండు విడిపోయాయి కానీ ఇంత వరకు సరైన నిర్ణయానికి రాలేకపోయాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం విశేషం.
Must Read ;- కరోనా వైరస్ ను వుహాన్ ల్యాబ్ లోనే సృష్టించారు: చైనీస్ శాస్త్రవేత్త