ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. 150 డివిజన్లలో మొత్తం 1296 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో అనూహ్యంగా బీజేపీ లీడింగ్ కనబరుస్తోంది. కారు స్పీడ్కు బ్రేకులేస్తూ కమలం పార్టీ తన జోరును పెంచేస్తోంది. బీజేపీ 50 డివిజన్లలో.. టీఆర్ఎస్ పార్టీ 30 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక డివిజిన్లో ఆధిక్యాన్ని కనబరిచింది. టీఆర్ఎస్ పార్టీ మొదట వెనుకబడినా తరువాత పుంజుకుంది. క్రమంగా ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇప్పటి వరకు 50 డివిజన్లలో బీజేపీ, టీఆర్ఎస్ 30, ఎంఐఎం 12 డివిజనల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంట్రీ పాసులు ఉన్న వారికి మాత్రమే లోకిని అనుమతిస్తున్నారు. 150 డివిజన్లలోని ఓట్లను మొత్తం 30 కేంద్రాల్లో లెక్కిస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే బీజేపీ తన జోరు పెంచేసింది. అయితే పూర్తి ఫలితాలు మధ్యాహ్నం లోపు రానున్నాయి. కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో 10 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Must Read ;- గ్రేటర్లో ఎవరికి గెలుపు వరించేను?.. ఆందోళనలో పార్టీ నేతలు!