ఓ వైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతుండగా మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం ఆంధోళన కలిగిస్తోంది. కరోనా అనంతరం అనేక మందిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 40,845 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. వీరిలో 3,129 మంది మృతి చెందినట్టు తెలిపారు. సోమవారం మంత్రుల బృందం, ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితి,వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులు చర్చించారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 13,083 మంది 18 నుంచి 45 ఏళ్లు లోపువారేనని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.17,464 మంది 45 నుంచి 60 ఏళ్ల లోపువారు,10,082 మంది 60 ఏళ్లు పైబడినవారు ఉన్నట్టు పేర్కొంది.
తగ్గని కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి
ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి ఇంకా తగ్గలేదన్నారు. ఇప్పటికే 80 జిల్లాల్లో పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నట్టు హెచ్చరించారు. వ్యాక్సిన్లు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లపై సమర్థంగానే పని చేస్తున్నట్టు గుర్తించామన్నారు. దేశంలో కరోనా వైరస్ గమనంపై జాతీయ అంటు వ్యాధుల నివారణ కేంద్రం (ఎన్సీడీసీ) డైరెక్టర్ సుజిత్ కుమార్ సింగ్ వివరమైన నివేదికను సమర్పించారని ఆరోగ్యశాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రధానంగా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశాలలో ఉన్నట్టు పేర్కొన్నారు.
Must Read ;- అందరికీ అందుబాటులో 2DG కరోనా మందు